జైపూర్, ఆగస్టు 23: ప్రధాని మోదీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఓ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘మోదీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత గ్రంథం ఎలాగో.. భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం కూడా అలాగే అని కచ్చితంగా చెప్పగలను’ అన్నారు. షెకావత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ నేతలకు జ్ఙానం ప్రసాదించాలని ఎద్దేవా చేసింది.