Jyotiraditya Scindia : కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సింధియా తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
సింధియా నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్తోపాటు స్థానిక బీజేపీ నేతలు ఉన్నారు. గుణ లోక్సభ స్థానానికి లోక్సభ మూడో విడత ఎన్నికల్లో భాగంగా మే 7న పోలింగ్ జరగనుంది. సింధియా నామినేషన్ దాఖలు చేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Lok Sabha elections 2024 | Madhya Pradesh: Union Minister and BJP candidate from Guna, Jyotiraditya Scindia files his nomination for general elections.
CM Mohan Yadav and former CM Shivraj Singh Chouhan are also with him. pic.twitter.com/MS2SUtCFO8
— ANI (@ANI) April 16, 2024