న్యూఢిల్లీ : పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర మంత్రి పోలియో చుక్కలను వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మాండవీయ విజ్ఞప్తి చేశారు.
పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర వైద్యారోగ్య ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రయాణ ప్రాంగణాలో ప్రత్యేక కేంద్రాలు, మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు. ఈ నెల 27న గ్రామాలు, పట్టణాల్లో పోలియో చుక్కలు వేస్తారు. మొదటి రోజు వేసుకోని వారికి 28న పోలియో చుక్కలు వేస్తారు. మార్చి ఒకటిన వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టి పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేస్తారు.
Delhi | Union Health Minister Mansukh Mandaviya launches Polio National Immunization Day, as part of National Immunization Drive; administers polio drops to children less than five years old. pic.twitter.com/bvPyay2jgi
— ANI (@ANI) February 26, 2022