16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం సభ్యులను సభ్యులను కేంద్రం నియమించింది. నలుగురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను చైర్మన్గా నియమిస్తూ గతేడాది డిసెంబర్ 31న కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నలుగురు సభ్యుల్లో 15వ ఆర్థిక సంఘం మాజీ సభ్యుడు, మాజీ వ్యయ కార్యదర్శి అజయ్ నారాయణ్ ఝా, మాజీ ప్రత్యేక కార్యదర్శి అన్నే జార్జ్ మాథ్యూ, మాజీ ప్రత్యేక కార్యదర్శి, అర్థ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష నియామకానికి రాష్ట్రపతి తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ 16వ ఫైనాన్స్ కమిషన్ పార్ట్ టైమ్ మెంబర్గా నియామకమయ్యారు. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా అధ్యక్షతన ఏర్పడే ఈ కమిషన్లో నలుగురు సభ్యులు కొనసాగుతున్నారు. వీరికి కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ఓ ఆర్థిక సలహాదారు సహకారం అందిస్తారు. కమిషన్ చైర్మన్, ఇతర సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి నివేదికను సమర్పించే తేదీ వరకు లేదంటే అక్టోబర్ 31, 2025 పదవిలో కొనసాగుతారని కేంద్రం నోటిఫికేషన్లో పేర్కొంది.
కేంద్రం డిసెంబర్ 31, 2023న పనగారియా అధ్యక్షతన కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్యానెల్ రాష్ట్రపతికి అక్టోబర్ 31, 2025 నాటికి సమర్పించనున్నది. ఆర్థిక సంఘం సిఫారసులు 2026 ఏప్రిల్ ఒకటి నుంచి 2031 వరకు కొనసాగుతాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయ పెంపు చర్యలను సూచించడంతోపాటు, విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం ఏర్పాటు చేసిన నిధులకు సంబంధించి విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రస్తుత ఏర్పాట్లను కమిషన్ సమీక్షిస్తుంది.