Union Budget 2025 | న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు. 2025-26 బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించారు. శాస్త్ర, సాంకేతిక రంగానికి రూ. 55 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
రెవెన్యూ వసూళ్లు రూ. 34,20,409 కోట్లు
పన్ను వసూళ్లు రూ. 28,37,409 కోట్లు
పన్నేతర వసూళ్లు రూ. 5,83,000 కోట్లు
మూలధనం వసూళ్లు రూ. 16,44,936 కోట్లు
రుణాల రికవరీ రూ. 29 వేల కోట్లు
ఇతర వసూళ్లు రూ. 47 వేల కోట్లు
అప్పులు, ఇతర వసూళ్లు రూ. 15,68,936 కోట్లు
మొత్తం ఆదాయం రూ. 50,65,345 కోట్లు
మొత్తం వ్యయం రూ. 50,65,345 కోట్లు
రెవెన్యూ ఖాతా రూ. 39,44,255 కోట్లు
వడ్డీ చెల్లింపులు రూ. 12,76,338 కోట్లు
మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ. 4,27,192 కోట్లు
మూలధన ఖాతా రూ. 11,21,090 కోట్లు
వాస్తవ మూలధన వ్యయం రూ. 15,48,282 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 5,23,846 కోట్లు
నికర రెవెన్యూ లోటు రూ. 96,654 కోట్లు
ద్రవ్య లోటు రూ. 15,68,936 కోట్లు
ప్రాథమిక లోటు రూ. 2,92,598 కోట్లు
రక్షణ రంగం – రూ. 4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి – రూ. 2,66,817 కోట్లు
హోం శాఖ – రూ. 2,33,211 కోట్లు
వ్యవసాయ, అనుబంధ రంగాలు – రూ. 1,71,437 కోట్లు
విద్యారంగం – రూ. 1,28,650 కోట్లు
ఆరోగ్య రంగం – రూ. 98,311 కోట్లు
పట్టణాభివృద్ధి రూ. 96,777 కోట్లు
ఐటీ, టెలికాం – రూ. 95,298 కోట్లు
ఇంధన రంగం – రూ. 81,174 కోట్లు
వాణిజ్యం, పారిశ్రామిక రంగాలు – రూ. 65,553 కోట్లు
సామాజిక, సంక్షేమ రంగం – రూ. 60,052 కోట్లు
శాస్త్ర, సాంకేతిక రంగం – రూ. 55,679 కోట్లు
ఇవి కూడా చదవండి..
Nirmala Sitharaman | నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం 75 నిమిషాలే.. ఇదే రెండో అతి చిన్నది.. !