న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అవసరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. దేశం ఒక్కటే అని, దేశ ప్రజలందరికీ ఒక్కటే చట్టం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి గిరిరాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అవసరమని గతంలో ప్రధాని మోదీ కూడా వెల్లడించారు.