బెంగాల్ దుర్గా పూజకు దేశంలోనే అత్యంత ప్రశస్తి ఉంటుంది. నవ రాత్రుల్లో అక్కడ జరిగే దుర్గా పూజలు విశేష ప్రాచుర్యం పొందాయి. బెంగాల్ దుర్గాకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఈ పూజకు యునెస్కో గుర్తింపు లభించింది. సాంస్కృతిక వారసత్వ పండుగల జాబితాలో దుర్గా పూజకు చోటు దక్కిందని యునెస్కో ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ అరుదైన చోటు దక్కడంతో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రతి భారతీయుడికీ ఎంతో గర్వకారణమని, యునెస్కో జాబితాలో చోటు దక్కడం ఎంతో సంతోషకరమైన విషయం అని మోదీ పేర్కొన్నారు. ఇక బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. ఈ విషయం బెంగాలీలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తాము దుర్గా పూజను కేవలం పూజగా మాత్రమే నిర్వహించమని, అది ఓ భావనలాగా నిర్వహించుకుంటామని మమత పేర్కొన్నారు.