బెంగళూరు, సెప్టెంబర్ 22: కర్ణాటకలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో అవినీతి బాగోతాలు రోజుకొక్కటిగా బయటకు వస్తున్నాయి. 40% కమీషన్ సర్కారుగా ముద్రపడ్డ బొమ్మై ప్రభుత్వం అక్రమాలను తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బయటపెట్టింది. పేదలకు ఇండ్ల నిర్మాణ పథకాల అమలులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు కాగ్ నిగ్గుతేల్చింది. లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలను తుంగలో తొక్కి, తమకు ఇష్టమున్నవారిని ఎంపికచేసినట్టు వెల్లడించింది. లక్ష్యానికి, పూర్తయిన ఇండ్ల నిర్మాణాలకు అసలు పొంతనే లేదని విమర్శించింది.
బెంగళూరు, సెప్టెంబర్ 22: కర్ణాటక విద్యాశాఖలో విద్యార్థులకు యూనిఫాం పంపిణీ లోనూ భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. తుమకూరు,మండ్య, మైసూర్, తదితర జిల్లాల్లో యూనిఫాం నాణ్యతపై భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ సొంత జిల్లా తుమకూరు నుంచి ఎక్కువగా యూనిఫాం నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయి.