ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్కు చెందిన పేరుమోసిన నేరగాడు, మాఫియా డాన్, సమాజ్వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్కు జీవితఖైదు పడింది. ఉమేశ్పాల్ కిడ్నాప్ కేసులో ప్రయాగ్రాజ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు శిక్ష విధించింది. అదేవిధంగా అతీక్ అహ్మద్కు రూ.5000 జరిమానా కూడా విధించింది.
అతీక్ అహ్మద్తోపాటు దినేశ్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్ను కూడా కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ తలా ఒక లక్ష రూపాయల చొప్పున ఉమేశ్ పాల్ కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా వదిలిపెట్టింది. నిర్దోషులుగా విడుదలైన వారిలో అతీక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్ అహ్మద్ కూడా ఉన్నాడు.
కాగా, 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకు అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2006 ఫిబ్రవరి 28న అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ కలిసి ఉమేష్ పాల్ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతను హత్యకు గురయ్యాడు. ఈ హత్య కూడా అతీక్ అహ్మదే చేయించినట్లు మరో కేసు నమోదయ్యింది.
#WATCH | Umesh Pal kidnapping case: The Police van, carrying mafia-turned-politician Atiq Ahmed, arrives at Prayagraj MP-MLA Court in Uttar Pradesh. pic.twitter.com/utdraV6AVX
— ANI (@ANI) March 28, 2023
#WATCH | Mafia-turned-politician Atiq Ahmed’s brother Ashraf deboards police van to enter Prayagraj MP-MLA Court in Uttar Pradesh in connection with the kidnapping case in which Atiq is also an accused. pic.twitter.com/oUwgQyALCk
— ANI (@ANI) March 28, 2023