న్యూఢిల్లీ: యూకే (UK) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్ (Rishi Sunak) మొదటి సారిగా భారత్లో పర్యటిస్తున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడానికి భారత్కు వచ్చిన ఆయన సతీ సమేతంగా న్యూఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయన్ని (Akshardham temple) సందర్శించారు. అక్షతా మూర్తితో (Akshata Murthy) కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
#WATCH | UK Prime Minister Rishi Sunak visits Delhi's Akshardham temple to offer prayers. pic.twitter.com/0ok7Aqv3J9
— ANI (@ANI) September 10, 2023
కాగా, నేడు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు (World leaders) మహాత్మా గాంధీ సమాధి (Mahatma Gandhi’s Samadhi) రాజ్ఘాట్ను (Rajghat) సందర్శించనున్నారు. ఉదయం 8.15 గంటలకు మహాత్మునికి (Mahatma Gandhi) నివాళులు అర్పించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రాజధాని నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. మరో 2 నుంచి 3 గంటలపాటు తేలికపాట నుంచి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రముఖుల రాజ్ఘాట్ సందర్శన ఉంటుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది.