న్యూఢిలీ: వేలిముద్ర ద్వారా చేసే ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియకు మరింత భద్రతను జోడించే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సోమవారం ప్రకటించింది.
ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేసే రెండంచెల ఈ కొత్త వ్యవస్థ ద్వారా ఆధార్ అథెంటికేషన్లో మోసపూరిత ప్రయత్నాలను వెంటనే గుర్తించవచ్చని, నియంత్రించవచ్చని పేర్కొంది. ఆధార్ అథెంటికేషన్ ద్వారా జరిగే లావాదేవీలు మరింత సురక్షితంగా జరపడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.