ముంబై, జూలై 5 : అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాలు దుర్వినియోగం, అపహరణపై తమ పార్టీ ఆధ్వర్యంలో ‘భగవాన్ రాముడిని రక్షించండి ఉద్యమం’ నిర్వహిస్తున్నట్టు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దాదర్లోని హనుమాన్ ఆలయం వద్ద ఆదివారం ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ‘నేడు దేశంలో హిందువులు వశీకరణకు గురయ్యారు’ అని వ్యాఖ్యానించారు. ‘అయోధ్య కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, కాశీ, మథురలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ జరగబోయే దోపిడీ గురించి నాకు ఆందోళనగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిరం పేరిట జరిగిన 22 వేల కోట్ల రూపాయల దోపిడీకి అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్లే బాధ్యులని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటూనే ఎన్నికల వ్యవస్థలను కూడా బలహీనం చేస్తున్నదని విమర్శించారు.