దుబాయి: రెండు డోస్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న భారతీయులు సహా 15 దేశాల పౌరులను అనుమతిస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. విలువైన వీసాలు కలిగి ఉన్న ఈ దేశాల పౌరులను ఆదివారం తమ దేశంలోకి అనుమతించినట్లు శుక్రవారం తెలిపింది. ఇంతకుముందు ఈ దేశాల పౌరుల రాకపై ఆంక్షలను యూఏఈ విధించింది.
యూఏఈ అనుమతించిన దేశాల్లో భారత్తోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, నంబియా, జాంబియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సైర్రాలోన్, లైబీరియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఆరు నెలలుగా విదేశాల్లో ఉన్నవారు కూడా తమ దేశానికి రావచ్చునని యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సీఈఎంఏ) ట్వీట్ చేసింది.