ఖమ్మం: ఛత్తీస్గఢ్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా గోండెరాస్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.
ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారు. వారిని మల్లన్గఢ్ ఏరియా కమిటీ సభ్యురాలు హిద్మే కొహ్రామ్, సీఎఎం పొజ్జెగా గుర్తించారు. హిడ్మె తలపై రూ.5 లక్షలు, పొజ్జె తలపై రూ.లక్ష రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో మూడు నాటు తుపాకులు, యుద్ధ సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. తప్పించుకున్న నక్సలేట్లకోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.