న్యూఢిల్లీ: బోలేనాథుడి దర్శనం కోసం అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఇద్దరు అమెరికన్లు కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఇద్దరు శ్వేతజాతీయులు ఈ యాత్రకు వచ్చారు. హిమాలయ గుహల్లో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకున్నారు. స్వామీ వివేకానంద అమర్నాథ్ దర్శనం చేపట్టారని, ఆయనకు ఎంతో మంచి అనుభవం కలిగిందని, ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథ తనకు తెలుసు అని, తాము అమర్నాథ్ దర్శనం కోసం రావడం సంతోషంగా ఉందని అమెరికన్లు తెలిపారు. బోలేనాథుడి కృప వల్ల దర్శనం బాగా జరిగిందని, ఆ ఫీలింగ్ను వ్యక్తం చేయలేకపోతున్నట్లు అమెరికన్లు చెప్పారు.
మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. జమ్మూ నుంచి ప్రారంభం కావాల్సిన అమర్నాథ్ యాత్రను ఇవాళ నాలుగో రోజు కూడా రద్దు చేశారు. జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.