డిస్పూర్ : అసోంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్ రైల్వేజంక్షన్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చెల్లుబాటయ్యే వీసాలు, పాస్పోర్టులు లేవని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా.. భారత్లోని ఉక్రెయిన్ ఎంబసీకి సమాచారం అందించారు. ఇద్దరు వ్యక్తులను ట్రస్కిన్స్కీ వ్లోదిమర్ (39), నజారీ వోజ్నిక్ (21)గా గుర్తించారు. ఇద్దరు త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్లో అగర్తల నుంచి న్యూఢిల్లీ వెళ్తుండగా పట్టుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు ప్రారంభించడంతో ఇద్దరు ఆ దేశం నుంచి పారిపోయారు.
ఆ తర్వాత బంగ్లాదేశ్ బస చేసి.. ఈశాన్య ప్రాంతం నుంచి భారత్లోకి చొరబడినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు భారత భూభాగంలోకి ఎలా ప్రవేశించారనే విషయంపై విచారణ జరుపుతున్నారు. వారి వద్ద నుంచి బంగ్లా కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రాథమిక విచారణలో ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి త్రిపుర మీదుగా భారత్లోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. ఇద్దరు ఫిబ్రవరిలో బంగ్లాదేశ్కు చేరుకున్నారు. ఇద్దరు తమ పాస్పోర్టులను పోగొట్టుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.