శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ (Kulgam) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని రెద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రత దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందంపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించారు.