శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కస్బయార్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ముష్కరులకోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. మృతిచెందినవారిని జైషే మహమ్మద్ టాప్ కమాండర్ యాసిర్, ఐఈడీ ఎక్స్పర్ట్ అయిన విదేశీ ఉగ్రవాది ఫర్క్వాన్గా గుర్తించామని కశ్మీర్ ఐజీ తెలిపారు.