భోపాల్, అక్టోబర్ 29: మధ్యప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకున్నది. దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు యువకులను వ్యాపారులు ట్రక్కుకు గొలుసులతో కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ క్రూరమైన ఘటన సోషల్మీడియాలో వైరల్గా మారింది.
పోలీసులు ఇద్దరు యువకులపై దొంగతనం కేసును నమోదు చేశారు. అలాగే, వారిని ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లిన వారిపై వీడియో సాక్ష్యం ఆధారంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇండోర్లోని చోయిత్రం మార్కెట్లో కూరగాయలు దించే సమయంలో ట్రక్కులో ఉన్న డబ్బులను యువకులు దొంగలించడం తాను చూశానని వ్యాపారులకు డ్రైవర్ చెప్పాడు. దీంతో వ్యాపారులు, పక్కనే ఉన్న కొందరు ఆ ఇద్దరు యువకుల కాళ్లను గొలుసులతో ట్రక్కుకు కట్టేసి మార్కెట్లో అతి క్రూరంగా ఈడ్చుకెళ్లారు.