రామాయణంలో శ్రవణ కుమారుడిని తలపించే కొడుకులు వీళ్లు. అంధులైన తల్లిదండ్రులను శ్రవణుడు కావడికి ఇరువైపులా మోస్తే.. ఈ కొడుకులు తమ తల్లి కండ్లలో ఆనందం కోసం ఆమెను భుజాలపైకి ఎత్తుకొని ఎత్తైన గుట్టెక్కారు.
కేరళలోని పశ్చిమ కనుమల్లో 12 ఏండ్లకోసారి పూసే అరుదైన నీలకురింజి పుష్పాలను తమ తల్లి ఎలికుట్టి పాల్ (87)కు దగ్గరుండి చూయించారు. ఆమె చిరకాల వాంఛను తీర్చారు.