ఘజియాబాద్: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్లోని పార్కులో త్వరలో వివాహం చేసుకోనున్న ఓ జంటపై ఇద్దరు పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. వదిలిపెట్టాలంటే రూ.5.5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడటమే కాకుండా తమతో లైంగిక చర్యకు రావాలని బాధిత యువతిని బలవంతం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు మూడు గంటల పాటు వేధించిన తర్వాత.. పోలీసులు రూ.వెయ్యి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 16న జరిగినట్టు తెలుస్తున్నది. బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. బాధిత యువతి తన కాబోయే భర్తను కలిసేందుకు సాయి ఉప్వాన్ పార్క్కు వెళ్లింది. ఈ సమయంలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు పోలీసు యూనిఫాంలో, మరో వ్యక్తి సాధారణ డ్రస్లో అక్కడకి వచ్చారు. వారు బాధిత జంటపై బెదిరింపులకు ప్పాలడుతూ, యువతితో అసభ్యకర్తంగా ప్రవర్తించారు. చివరకు రూ.వెయ్యి లంచం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.