కొత్తగూడెం కైమ్, డిసెంబర్ 14: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మృతిచెందారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని బోధిన్టోలా ప్రాంతం లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. వీరి రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒకరు 2019లో జాంబుల్ఖేడా పేలుడులో కీలక పాత్ర పోషించారు.
మరో ఘటనలో మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్ ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఇతడిని బీజాపూర్కు చెందిన మడ్కం హిడ్మా అలియాస్ చైతూగా గుర్తించారు. ఇతడిపై 14 లక్షల రివార్డు ఉన్నది. మరోవైపు, ఛత్తీస్గఢ్లోని కాంకర్ జిల్లాలో మావోయిస్టుల మందుపాతర పేలడంతో బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు.