శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదల కదలికలకు సంబంధించి సమాచారం అందుకున్న భద్రతాబలగాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఉదయం చెక్ చొలాన్ ఏరియాలో ఉగ్రవాదులు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉన్నది.
భద్రతాబలగాల కాల్పుల్లో ఉదయమే ఒక గుర్తుతెలియని ఉగ్రవాది హతమవగా.. మధ్యాహ్నం మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. దాంతో ఈ ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరింది. ఆ తర్వాత కాల్పులు ఆగిపోయినప్పటికీ ఆ ఏరియాలో ఇంకా ఉగ్రవాదులు దాగి ఉన్నారేమో అనే అనుమానంతో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.