బీడ్, డిసెంబర్ 19: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కుక్కపిల్లలను చంపేస్తున్న రెండు కోతులను అటవీ శాఖ అధికారులు పట్టుకొన్నారు. వాటిని నాగ్పూర్కు తరలించి అక్కడి అడవిలో విడిచిపెట్టనున్నట్టు తెలిపారు. మజల్గావ్ తాలూకాలో నెల రోజులుగా ఈ కోతులు దాదాపు 300 కుక్క పిల్లలను చంపేశాయి. గతంలో ఇక్కడి కుక్కలు ఓ కోతిపిల్లను చంపేశాయి. దీంతో ఈ కోతులు పగ పెంచుకొన్నాయి. కుక్క పిల్లలను ఎత్తైన చెట్లు, భవనాల మీదకు తీసుకెళ్లి కిందకి వదిలేసి చంపేస్తున్నాయి.