ఇంఫాల్, ఆగస్టు 29: మణిపూర్లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని నరైన్సెన్లో మంగళవారం రెండు మిలిటెంట్ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి. గ్రామ వలంటీర్గా పనిచేస్తున్న ఒకరు బాంబు పేలుడులో మరణించగా, మరో వ్యక్తి భుజంపై బుల్లెట్ గాయమైంది. కాగా, పోలీసులు మంగళవారం జరిపిన సోదాలలో వేర్వేరు గ్రూపులకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఆయధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ లోయలోని ఐదు జిల్లాలలో భద్రతా బలగాల తనిఖీలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.