ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సియాన్ ఆస్పత్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ వెంటనే కారులోంచి మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పే లోపే ఇద్దరు సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం సియాన్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు, బాధితులు ముంబైలోని మన్ఖుర్ద్ ఏరియాకు చెందిన వారిగా గుర్తించారు. మన్ఖుర్ద్ నుంచి మెరైన్ డ్రైవ్కు పార్టీ చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారని తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించినట్లు తెలిపారు.
#Mumbai: 2 Killed, 3 Injured After Car Catches Fire Due to Accident Near Sion Hospital#Sion #Mumbai @aishooaaram pic.twitter.com/dGJjBUOuEg
— Free Press Journal (@fpjindia) September 11, 2023