న్యూఢిల్లీ, జూలై 12: ఓ వ్యక్తికి ఒకేవైపు రెండు కిడ్నీలను అమర్చారు ఢిల్లీకి చెందిన సర్ గంగారామ్ దవాఖాన వైద్యులు. పంజాబ్కు చెందిన 29 ఏండ్ల వ్యక్తి ఎడమ కిడ్నీకి ఆనుకొని ఉన్న మూత్రనాళంలో రాయి ఉన్నది. దీంతో అతడు వైద్యులను సంప్రదించాడు. పరిశీలించిన డాక్టర్లు ఎడమ కిడ్నీని తొలగించి కుడివైపున అమర్చాలని నిర్ణయించారు. వెంటనే విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం కుడివైపున రెండు కిడ్నీలు ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.