శ్రీనగర్ : నిషేధిత ఉగ్రవాద సంస్థ AGuHతో సంబంధం ఉన్న ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల గురించి పక్కా సమాచారం అందుకున్న వాఘమా-ఓప్జాన్ రోడ్లో ఆర్మీ (3RR), పోలీసులు సంయుక్తంగా నాకాబందీ ఏర్పాటు చేశారు. తనిఖీ సమయంలో బృందాలు ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వాఘమా బిజ్బెహరా నివాసి తన్వీర్ అహ్మద్ భట్, మిడోరా ట్రాల్లోని అహ్మద్ దార్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
సోదాల్లో వారి వద్ద నుంచి రెండు పిస్టల్స్తో పాటు రెండు మ్యాగజైన్లు, 15 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై బిజ్బెహరా పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని సంగల్దాన్, గూల్ అటవీ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఆదివారం భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించాయి. చైనా పిస్టల్తో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.