భోపాల్: ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాలను క్రమంగా పెద్ద ఎన్క్లోజర్లోకి వదిలేస్తున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్ ఎన్క్లోజర్లో 50 రోజుల పాటు ఉన్న వాటిలో ఈ నెల 6న రెండు మగ చీతాలను పెద్ద ఎన్క్లోజర్లోకి వదిలిపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రెండు ఆడ చీతాలను లార్డ్ ఎన్క్లోజర్లోకి వదిలేశారు. మరో నాలుగు చీతాలను త్వరలోనే విడుదల చేయనున్నామని అధికారులు తెలిపారు. పెద్ద ఎన్క్లోజర్లో ఉన్న నాలుగు చీతాల కదలికలను శాటిలైట్ కాలర్స్, కెమెరాలతో ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.
దేశంలోకి 74 ఏండ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో ప్రస్తుత ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో చివరి చీతా మరణించినతర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. దీంతో 1952లో ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చింది. వీటిలో నాలుగు నుంచి ఆరేండ్ల మధ్య వయసు కలిగిన ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి.