Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్లోని(Himachal Pradesh) సిమ్లా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు (HRTC) చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సు కండక్టర్ జయ్ ప్రకాష్ నేగి (57), దాకు రామ్ (72) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రాంపూర్లోని మహాత్మా గాంధీ మెడికల్ సర్వీస్ కాంప్లెక్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తామని డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు.