పాట్నా : బిహార్లోని గండకీ నదిలో బుధవారం ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకున్నది. 25 మందితో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్నేహితుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో బిహార్లోని వైశాలి ప్రాంతంలో లాల్గంజ్లో బుధవారం ఘటన జరిగింది. ఎడతెరిపి లేని వర్షాలకు గండకీ నదిలో నీటి ప్రవాహం పెరిగింది.
ఈ క్రమంలో నీటి ప్రవాహం కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నది ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. లాల్గంజ్ సర్కిల్ అధికారి పంకజ్ కుమార్ మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరికొందరిని రక్షించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు చెప్పారు.