జైపూర్: రాజస్థాన్లోని కోటాలో (Kota) ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్లో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. రైల్వే సిబ్బంది ఆ మార్గంలో మరమ్మతులు చేస్తున్నారు. వీలైనంత తొందరగా రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని వెల్లడించారు. కాగా, ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను అధికారులు విడుదల చేశారు.
#WATCH | Rajasthan: Two coaches of the Jodhpur-Bhopal passenger train derailed near Kota Junction late last night. No casualties were reported. Repair work is underway. pic.twitter.com/ehUmRFcJi3
— ANI (@ANI) January 6, 2024