లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇద్దరికి కప్పా వేరియంట్ కరోనా వైరస్ సోకినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. లక్నోలోని కేజీఎంయూ హాస్పిటల్ నుంచి సుమారు 109 శ్యాంపిళ్లను ఇటీవల జన్యు సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్కు పంపారు. అయితే దాంట్లో 107 మందిలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఉన్నట్లు తేల్చారు. ఇక ఇద్దరిలో మాత్రం కప్పా వేరియంట్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దేశంలో సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాకముందే.. కొత్త కొత్త వేరియంట్లు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది. డెల్టా, ఆల్ఫా, కప్పా వేరియంట్లు చాలా ప్రమాదకర రీతిలో వ్యాపిస్తున్న విషయం తెలిసిందే.