Jacqueline Fernandez : మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కేసు కీలక మలుపు తిరగబోతుంది. ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్రూవర్గా మారబోతుంది. ఈ విషయాన్ని ఆమె ఢిల్లీ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కోర్టు.. తను అప్రూవర్గా మారాలనుకుంటున్న విషయాన్ని ఈ కేసును విచారిస్తున్న ఈడీకి చెప్పాలని సూచించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రకారం.. అప్రూవర్గా మారాలనుకుంటున్న విషయాన్ని జాక్వెలిన్ ముందుగా విచారణ సంస్థకు తెలియజేయాలి.
ఆ తర్వాత వారు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. తర్వాత, ఈ వాంగ్మూలం ఆధారంగా ఆమెను అప్రూవర్గా మార్చి, ఈ అంశాన్ని కోర్టు ముందుకు తీసుకురావాలా.. వద్దా అనేది నిర్ణయిస్తారు. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ప్రస్తుతం బెయిల్పై ఉంది. ఈ అంశంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన క్రిమినల్ చర్యలను రద్దు చేయాలని కోరుతూ గతంలో జాక్వెలిన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ, దీనికి కోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతం జాక్వెలిన్ అప్రూవర్గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖరన్పై అనేక కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో అతడికి బెయిల్ లభించింది. అతడు ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. సుకేష్, జాక్వెలిన్ కొంతకాలం క్రితం రిలేషన్లో ఉన్నారు. ఇదే సమయంలో సుకేష్ పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు.
అలాగే, ఆ డబ్బులో చాలా వరకు జాక్వెలిన్కు అతడు ఖరీదైన గిఫ్ట్ల రూపంలో ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. కార్లు, నగలు, బ్రాండెడ్ దుస్తులు వంటివి కలిపి రూ.7 కోట్ల విలువైన గిఫ్టులను సుకేష్.. జాక్వెలిన్కు ఇచ్చాడు. అప్పటికే అతడిపై అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నప్పటికీ, జాక్వెలిన్ వాటిని స్వీకరించింది. దీంతో ఆమెపై కూడా ఈడీ కేసు నమోదు చేసి, 2022లో చార్జిషీటు కూడా సమర్పించింది. మరోవైపు ఈడీ ఆరోపణల్ని జాక్వెలిన్ ఖండించింది. సుకేష్ ఆర్థిక నేరాలపై తనకు ఎలాంటి అవగాహన లేదని తెలిపింది.