న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రానున్న తమిళనాడు ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములతో పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని తమిళగ వెట్ర కళగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు. తమ పార్టీ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని, సంప్రదాయ పార్టీలైన రెండు వ్యతిరేక పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుందని ఆయన చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఇండియా కూటమిలో కాని ఎన్డీఏలో కాని టీవీకే చేరబోదని ఇండియా టుడే టీవీకి ఆయన చెప్పారు.