చెన్నై: తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్ తాను రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచిరాపల్లి ఉత్తరం నుంచి తాను ‘సి జోసెఫ్ విజయ్’ పేరుతో బరిలో ఉంటానని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం నియోజక వర్గాల్లో తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ఆయన వెల్లడించారు.