న్యూఢిల్లీ: ఏనుగు దంతాల వేట వాటి జన్యువులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. జన్యుమార్పుల కారణంగా ఏనుగులు కాలక్రమంలో వాటి దంతాలను కోల్పోతున్నాయి. మొజాంబిక్లో అంతర్యుద్ధం సమయంలో (1977-1992) ప్రజలు నిధుల కోసం ఏనుగులను వేటాడి దంతాలను అమ్ముకొన్నారు. ఫలితంగా 90శాతం ఏనుగులు అంతరించిపోయాయి. మిగిలిన కొన్ని ఏనుగుల నుంచి దంతాలను కలుగజేసే జన్యువులు పిల్లలకు సంక్రమించడం తగ్గింది. ఫలితంగా ఏనుగుల్లో దంతాల పెరుగుదల క్రమంగా లోపించింది.