ముంబై: మహాత్మా గాంధీ(Mahatma Gandhi)కి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ లేదని ఇటీవల జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల పట్ల మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ(Tushar Gandhi) రియాక్ట్ అయ్యారు. గవర్నర్ మనోజ్ సిన్హా వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఎంకే గాంధీ రెండు మెట్రిక్లు పాసైనట్లు వెల్లడించారు. ఒకటి రాజ్కోట్లోని ఆల్ఫ్రెడ్ హైస్కూల్లో, రెండవది లండన్లో బ్రిటీష్ మాట్రికులేషన్ చేసినట్లు చెప్పారు. లండన్ యూనివర్సిటీతో సంబంధం ఉన్న ఇన్నర్ టెంపుల్ లా కాలేజీ నుంచి న్యాయ పట్టాను గాంధీ పొందినట్లు తుషార్ తన ట్వీట్లో తెలిపారు.ఇంకా లాటిన్, ఫ్రెంచ్ భాషల్లోనూ మహాత్మా గాంధీ రెండు డిప్లమాలను పొందినట్లు తుషార్ వెల్లడించారు. ఈ అంశాలకు చెందిన ఓ లేఖను గవర్నర్ మనోజ్కు పంపినట్లు తుషార్ గాంధీ తన ట్వీట్లో తెలిపారు.
(1 of 2 M. K. Gandhi Qualifications)M. K. Gandhi passed 2 Matrics 1 from Alfred High School Rajkot, 2nd it’s equivalent in London, British Matriculation. He acquired, by studying & passing exams a Law Degree from Inner Temple, a law College affiliated to London University…
— Tushar (@TusharG) March 24, 2023
గ్వాలియర్లోని ఐటీఎంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. గాంధీకి ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కానీ అర్హత కానీ లేదన్న విషయం మీకు తెలుసా అని అన్నారు. మహాత్మా గాంధీకి న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉందని చాలా మంది భావిస్తుంటారని, కానీ ఆయన ఆ డిగ్రీ లేదన్నారు. ఆయనకు కేవలం హై స్కూల్ డిప్లమా ఉందన్నారు. లా ప్రాక్టీసు చేసేందుకు ఆయన క్వాలిఫై అయ్యారని, కానీ గాంధీకి లా డిగ్రీ లేదని సిన్హా ఆ కార్యక్రమంలో అన్నారు.
I agree, Bapu did not hold a degree in Entire Law!
— Tushar (@TusharG) March 24, 2023
గవర్నర్ సిన్హా వ్యాఖ్యలను ఖండిస్తూ. .తుషార్ గాంధీ ఆయనకు బాపూ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని పంపారు. జమ్మూ రాజ్భవన్కు ఓ కాపీని పంపినట్లు వెల్లడించారు. ఆ పుస్తకాన్ని చదవి, గవర్నర్ ఎడ్యుకేట్ కావాలని ఆకాంక్షించారు. అయితే మహాత్మా గాంధీకి యావత్ న్యాయ విద్యలో పూర్తి స్థాయి డిగ్రీ లేదన్న విషయాన్ని అంగీకరించనున్నట్లు తుషార్ తన ట్వీట్లో చెప్పారు.