ఎర్రకోట వరకు మార్గం.. ఓ ఉరితీసే గది కూడా..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శాసనసభలో బ్రిటీషర్ల కాలంనాటి పురాతన సొరంగంతో పాటు ఉరితీసే గది ఒకటి బయటపడింది. వచ్చే ఏడాది జనవరి 26 లేదా ఆగస్టు 15నాటికి ప్రజల సందర్శనార్థం వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని స్పీకర్ గోయల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటీషర్ల నిర్మాణశైలితో రూపొందించిన ఈ సొరంగం అసెంబ్లీ పునాదుల్లో 2016లో గుర్తించినట్టు తెలిపారు. ఇది అసెంబ్లీ నుంచి ఎర్రకోటను కలుపుతుందన్నారు. నగరంలో మెట్రో రైలుమార్గం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పటికే ఈ సొరంగం పాక్షికంగా దెబ్బతిన్నదని, అందుకే దీన్ని మళ్లీ పునర్నిర్మించాలనుకోవడం లేదన్నారు. ఉరితీసే గదిని ఆధునీకరిస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీని 1911లో నిర్మించారు.