ఝాగ్రామ్ (పశ్చిమబెంగాల్), మే 19: దేశంలో తుగ్లక్ పాలన కొనసాగుతున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. టీచర్ల నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని బుధవారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో గురువారం మమత మాట్లాడుతూ ప్రతిపక్షాలను వేధించడానికి సీబీఐ, ఈడీలాంటి సంస్థలను కేంద్రం పావులా వాడుకుంటున్నదని ఆరోపించారు. అవినీతికి పాల్పడిందెవరో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.