న్యూఢిల్లీ: తప్పుడు వార్తల యుగంలో నిజం బాధితురాలిగా మారిందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల నిజాన్ని వాస్తవాల ఆధారంగా నిర్ధారించుకోవడం లేదన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన అమెరికన్ బార్ అసోసియేషన్ ఇండియా సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు.
ప్రజల్లో సహనం తక్కువగా ఉందని, తమ దృష్టి కోణానికి భిన్నంగా ఉన్నవాటిని ఆమోదించడం లేదన్నారు. మనం చేసే ప్రతి పనికీ మన దృష్టి కోణాన్ని పంచుకోని వారి నుంచి ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తున్నదన్నారు.