Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్కు ఊరట కలిగే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)తో సమావేశం తర్వాత ట్రంప్ మాట్లాడుతూ ఆదేశపు వ్యాపార భాగస్వాములపై మరోమారు ఆంక్షలు విధించడానికి తొందర పడడం లేదని వెల్లడించారు. భారత్పై విధించిన సుంకాల భారంపై మరో రెండు మూడు వారాల్లో పునరాలోచిస్తానని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు.
‘రష్యాతో చమురు కొంటున్న దేశాలపై విధించిన సుంకాలపై, ఆంక్షలపై పునరాలోచిస్తాను. వచ్చే రెండు మూడు వారాల్లో ఈ విషయంపై చర్చిస్తాను. అయితే.. ఈ అంశంపై త్వరగా ఆలోచించాలని అనుకోవడం లేదు. ఇప్పుడు రష్యా వ్యాపార భాగస్వాములపై రెండో దఫా ఆంక్షలు విధిస్తే వాళ్లు తట్టుకోలేరు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇదే ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం ఫలవంతంగా సాగిందని పేర్కొన్న ట్రంప్ .. తమ మీటింగ్కు పదికి పది రేటింగ్ ఇచ్చారు.
Trump on secondary tariffs: “Because of what happened today, I think I don’t have to think about it. I may have to think about it in two weeks or three weeks or something, but we don’t have to think about that right now. I think the meeting went very well.” pic.twitter.com/OAZgaotTY7
— The Bulwark (@BulwarkOnline) August 16, 2025
రష్యా నుంచి చమురు కొనేదేశాల్లో ఒకటైన భారత్పై 25 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్.. వాటిని మరో 25 శాతానికి పెంచారు. ఫలితంగా రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే చమురు, ఇతర వస్తువులకు చెల్లించాల్సిన సుంకం యాభైకి చేరింది. అంతేకాదు తన మాటల్ని పెడచెవిన పెట్టి రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. రెండో దఫా ఆంక్షలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే.. అలస్కా సమావేశంతో అమెరికా అధినేత కాసింత దూకుడు తగ్గించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతి ఒప్పందంతో ముగించాలని అనుకుంటున్న ఆయన.. ఆంక్షలపై కూడా వెనక్కి తగ్గేలా కనిపిస్తున్నారు. కానీ.. ట్రంప్ నిర్ణయం ప్రకటించేంత వరకూ నమ్మడానికి వీల్లేదు.