న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. నాలుగవ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు.. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు.. వెల్లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలన్నారు.
12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ రాజ్యసభలో ఇవాళ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో చైర్మెన్ వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.