న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే నిరసనలు మొదలయ్యాయి.
రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం మేరకు ఎంపీలు ప్రసంగాన్ని బహిష్కరించారు. ఆ మేరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం సమయంలో విపక్షాలు నినాదాలు చేశాయి. కేంద్రం విధానాలకు నిరసనగా కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు నినాదాలు చేయడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై గట్టిగా పోరాడాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశా నిర్దేశం చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా కేంద్రం నుంచి రావల్సినవి ఏవీ రాష్ట్రానికి రావడం లేదన్న కేసీఆర్ .. విభజన హామీలు, ఆర్ధిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్లో నిరసనలు కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయం
చారు. శీతాకాల సమావేశాలను కూడా టీఆర్ఎస్ బహిష్కరించిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్న పార్లమెంట్ ఉభయ సభలకు టీఆర్ఎస్కు చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరూ దూరంగా ఉన్నట్లు లోక్సభలో టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు.