న్యూఢిల్లీ: త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 16వ తేదీన, మేఘాలయా, నాగాలాండ్లో ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మూడు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలను మార్చి 2వ తేదీన ప్రకటించనున్నారు.
Schedule for GE to the Legislative Assemblies of Meghalaya, Nagaland & Tripura.#AssemblyElections2023 #ECI pic.twitter.com/nZLJtADBMz
— Election Commission of India #SVEEP (@ECISVEEP) January 18, 2023
నాగాలాండ్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీలు వరుసగా మార్చి 12, 15, 22వ తేదీల్లో ముగియనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 1.76 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు వేయనున్నారు. 376 పోలింగ్ బూత్లు మహిళా సిబ్బంది ఆధీనంలో ఉండనున్నాయి.
Schedule for Bye-Elections to fill 7 vacancies in PC/AC till now#ECI pic.twitter.com/Ol3IH2UjYn
— Election Commission of India #SVEEP (@ECISVEEP) January 18, 2023
మూడు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనున్న నేపథ్యంలో జనవరి 11వ తేదీన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఆ రాష్ట్రాల్లో పర్యటించింది. వరుస సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలపై ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది.