న్యూఢిల్లీ, మార్చి 1: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం జరగనున్నది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.
గురువారం మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయాలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మేఘాలయలో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 78 శాతం, నాగాలాండ్లో 59 స్థానాలకు 86 శాతం, త్రిపురలో 60 స్థానాలకు 87 శాతం పోలింగ్ నమోదైంది.