గోమతి: త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ (Biplab Deb) ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్పూర్లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఉదయ్పూర్లోని ఆయన పూర్వీకుల ఇంటికి పూజారుల బృందం చేరుకున్నది. ఈనేపథ్యంలో రాత్రి పొద్దుపోయిన తర్వాత అక్కడి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తులు వేద పండితులపై దాడికి దిగారు.
వారిని విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా వారి వాహనాలకు నిప్పుపెట్టారు. సీఎం ఇంటిపై దాడిచేసి మంటలు అంటించారు. దీంతో ఇళ్లుతోపాటు మరో దుకాణం అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను అదుపుచేశారు. కాగా, ఈదాడిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సీపీఎం పనేనని విమర్శించారు.
Tripura | We came here to worship Mata Sundari. While I was here, a large number of people came towards our car & attacked me: J Kaushik, SC lawyer & victim, on miscreants' attack at Tripura ex-CM Biplab Deb's ancestral home in Jamjuri pic.twitter.com/svd4enJMJV
— ANI (@ANI) January 3, 2023