కటక్: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో మృతుల సంఖ్య 289కి చేరింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కటక్లోని శ్రీరామచంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. అతడిని బిజయ్ పాశ్వాన్గా గుర్తించారు. పాశ్వాన్ జూన్ 3 నుంచి కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అతనికి వెన్నుపూసకు బలమైన గాయంతోపాటు ఒంటి నిండా పలు గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా, ఈ నెల 2న ఒడిశాలోని బిలాస్పూర్ జిల్లాలోగల బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిగ్నిలింగ్లో తప్పిదంతో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే 288 మరణించగా, తాజాగా మరో వ్యక్తి మరణంతో మృతుల సంఖ్య 289కి పెరిగింది.