న్యూఢిల్లీ : కొవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో కీలక సూచన చేసింది. కొవిడ్ -19 నివారణకు సంబంధించి గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. హోం ఐసోలేషన్లో ఉండే కరోనా పాజిటివ్ బాధితులు.. తప్పనిసరిగా ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్కును ధరించాలని ఆదేశించింది. బాధిత వ్యక్తి ఇంట్లోని ఓ గదిలో ఒంటరిగా ఉండాలని, ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని సూచన చేసింది. ఈ జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి విముక్తి పొందొచ్చు అని తెలిపింది.
ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. నిన్న ఒక్కరోజే 3,79,257 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా 2,04,832 మంది మరణించగా, గడిచిన 24 గంటల్లో 3,645 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..