హైదరాబాద్ : కూకట్పల్లి పటేల్కుంట పార్కు వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానికంగా ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం ఆ డబ్బును దుండగులు అపహరించి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరేమో డబ్బులు నింపుతున్న వ్యక్తి కాగా, మరొకరు సెక్యూరిటీ సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిలో రెండు బుల్లెట్లు, బుల్లెట్ లాక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.